image



మన పార్లమెంటు భవనానికి 96 ఏళ్లు




 
→ ప్రపంచంలో అద్భుతమైన కట్టడాల్లో ఒకటిగా పేరొందిన మన దేశ పార్లమెంటు భవనం ఎన్నో చారిత్రక ఘటనలకు నిలువెత్తు సాక్ష్యం బ్రిటిష్ వలస పాలన, దానికి చరమ గీతం పాడుతూ స్వతంత్ర భారతావని ఆవి. ర్భావం. 
 
→ నూతన రాజ్యాంగం, వినూత్న చట్టాలు, వాదప్రతివాదాలు, వివాదాస్పద శాస నాలు తదితరాలు ఎన్నిటికో వేదికైన ఈ అపు రూప కట్టడానికి ప్రారంభోత్సవం జరిగి బుధవా దానికి సరిగ్గా 96 ఏళ్లు పూర్తయ్యాయి. 
 
→ 1927 జనవరి 18న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. 
 
→ భారత్ లో బ్రిటన్ సామ్రాజ్య రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించిన నేపథ్యంలో రైసినా హిల్ ప్రాంతంలో 1921 ఫిబ్రవరి 12న పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 
 
→ బ్రిటన్ ఆర్కిటెక్ట్లు సర్ హెర్బర్ట్ వాకర్, సర్ ఎడ్విన్ లుటియన్లు దీని రూపశిల్పులు. 
 
→ 560 అడుగుల వ్యాసంతో, మైలులో మూడో వంతు చుట్టుకొలత గలిగిన వలయాకార సుందర కట్ట డాన్ని పూర్తిచేయడానికి ఆరేళ్ల సమయం. పట్టింది. 
 
→ ప్రపంచంలోనే ఆమోఘమైన పార్ల మెంటు భవనంగా ఆనాడు ప్రసిద్ధికెక్కింది. 
 
→ ఈ ప్రాంగణంలోనే నిర్మితమవుతున్న కొత్త పార్లమెంటు సముదాయం త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. 
 
→ అది అందుబాటులోకి వచ్చాక పాత భవనం మన దేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
 



National