image



వార్షిక విద్యా స్థాయి (ఆసర్) నివేదిక




→ గత దశాబ్ద కాలంలో ఏటా 60 కంటే తక్కువ విద్యార్ధులు చేరిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరు గుతూనే ఉంది. 
 
→ ఈ విషయం వార్షిక విద్యా స్థాయి (ఆసర్) నివేదికలో వెల్లడైంది. 
 
→ 2022లో చిన్న పాఠశా లలు ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉన్నాయి. వాటి సంఖ్య ఉత్తర ప్రదేశ్లో 2018లో 10. 4% నుంచి 2022లో 7.9%కు, కేరళలో 2018లో 24. 1 నుంచి 2022లో 16.2%కు తగ్గింది. 
 
→ తొలి ఆసర్ సర్వే 2005లో జరిగింది. అప్పట్నుంచి పదేళ్ల పాటు ఏటా నిర్వహించారు. 
 
→ మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2022లో తొలిసారిగా క్షేత్రస్థాయి ప్రాథమిక సర్వే చేశారు. 
 
→ కొవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసేసిన తర్వాత మళ్లీ ఇప్పుడే విద్యార్థులు వస్తుం డటంతో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
→ ఇందులో భాగంగా 19,060 గ్రామాల్లోని 3,74,544 కుటుంబాల్లో 3 నుంచి 16 సంవత్సరాల మధ్య వయ సున్న 6,99,597 మంది పిల్లలను పరిశీలించారు. 
 
→ 2018 స్థాయి కంటే విద్యాహక్కు చట్టంలోని సూచికలన్నింటిలో దేశవ్యాప్తంగా కొంత మెరుగుదల కనిపించింది. 
 
→ 2018లో బాలికలు ఉపయోగించగల మరుగుదొడ్లు 66.4% ఉండగా, ఆది 2022లో 68.4% కు పెరిగింది. 
 
→ అలాగే తాగునీటి సదుపాయం 74.8% నుంచి 76% కు పెరిగింది. పాఠ్యపుస్తకాలే కాక, ఇతర పుస్తకాలున్న పాఠశాలల సంఖ్య 36, 9% నుంచి 44%కు పెరిగింది. 
 
→ అయితే రాష్ట్రాల వారీగా ఈ గణాంకాల్లో తేడాలు న్నాయి. ఆంధ్రప్రదేశ్లో తాగునీరు అందుబాటులో ఉన్న పాఠశాలల సంఖ్య 2018లో 58.1% నుంచి 2022 నాటికి
65.6% కు పెరిగింది.
 
 
 
 
అరుణాచల్ ప్రదేశ్ లో పెరిగిన చేరికలు
 
→అరుణాచల్ ప్రదేశ్ లో గత 15 ఏళ్లలో పాఠశాలల్లో పిల్లల చేరిక పెరిగింది. 
 
→2018లో ఇది 97.2% ఉండగా, ఉంది. ప్రథమ్ ఫౌండేషన్ కార ణంగా ఇక్కడి అభ్యసన ఫలితాలు మెరుగుపడ్డాయి. 
 
→సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలతో పాఠశాలల్లో బాలికల చేరిక కూడా పెరిగింది. 
 
→కానీ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశా లల్లో అయిదో తరగతి పిల్లలు తీసివేతలు చేయగల సామర్థ్యం 2018లో 27.1% ఉండగా, 2022లో 22. 9%కు తగ్గింది. 
 
→ఎనిమిదో తరగతిలోనూ తీసివేతలు చేసే సామర్ధ్యం 2018లో 49.3% నుంచి 2022లో 45. 3%కు తగ్గింది. సాధారణ ఇంగ్లిషు వాక్యాలు చదివే సామర్ధ్యం అరుణాచల్
ప్రదేశ్లో కొద్దిగా పెరిగింది.
 
→దేశంలో గల అయిదేళ్ల చిన్నారుల్లో మూడింట ఒక వంతు మంది ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి కంటే తక్కువ తరగతిలోనే చదువుతున్నారు. 
 
→నూతన విద్యా విధానం ప్రకారం దేశంలో 1వ తరగతిలో చేరడానికి చిన్నారులకు కనిష్ఠంగా ఆరేళ్ల వయసు వచ్చి ఉండాలి.
 
 



National