→ దేశంలో హరిత హైడ్రోజన్ తయారీకి రూ.19,744 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది.
→ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం 'నేష నల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోదముద్ర వేసింది..
→ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ ఖరారు చేస్తుంది.
→ వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడటానికి ఈ పథకం ఉప యోగ పడుతుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఇవీ లక్ష్యాలు:-
→ 2030 కల్లా, ఏడాదికి 50 లక్షల మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం
→ దీనిని దేశీయ వినియోగంతో పాటు ఎగుమతి చేయాలన్నదీ ప్రణాళిక.
→ ఇందుకోసం 60-100 గిగావాట్ల ఎల క్రోలైజర్ సామర్థ్యాన్ని అభివృద్ధిచేస్తారు. తక్కువ ఖర్చుతో హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తారు.
→ ఈ పథకం కింద తొలుత ఎలక్ట్రోలైజర్ తయారీ దారులకు 5 ఏళ్ళ వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు.
→ తర్వాత హరిత హైడ్రోజన్ ఉత్పత్తి దారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు.ఈ మొత్తం కలిపి 17,490 కోట్లు
→ హరిత హైడ్రోజన్ కేంద్రాల అభివృద్ధికి రూ.400 కోట్లు ఖర్చు చేస్తారు. పీఎంగతిశక్తి ప్లాట్ఫామ్ ద్వారా వీటిల్లో మౌలికవసతులు అభివృద్ధి చేస్తారు..
→ రిఫైనరీలు, ఉక్కు, షిప్పింగ్ లాంటి రంగాల్లో హరిత హైడ్రోజన్ వినియోగం కోసం ప్రయోగాత్మక ప్రాజెక్టు అమలుకు రూ.1,466 కోట్లు కేటాయిస్తారు.
→ ఈ మిషన్ ను సరైన దిశలో నడపడానికి సంబంధిత నిపుణులతో సాధికార బృందాన్ని ఏర్పాటు చేసి, సహకరిం చేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని నియమిస్తారు.
→ ఈ మిషన్ ను నడిపించడానికి పునరుత్పాదక ఇంధనశా ఖలో మిషన్ సెక్రెటేరియట్ ఏర్పాటుచేస్తారు. దాని డైరె క్టరుగా అత్యంత నైపుణ్యం గల వ్యక్తిని నియమిస్తారు.
→ దీనివల్ల 2030 కల్లా ఏటా 50 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుంది.
National