image



ఉగ్రవాదుల సొరంగ మార్గాల గుర్తింపునకు తొలిసారి రాడార్లతో కూడిన డ్రోన్లు




→పాకిస్థాన్‌ సరిహద్దు వెంబడి జమ్మూలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్న భూగర్భ సొరంగాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) వినియోగిస్తోంది. 
 
→రాడార్లతో కూడిన ఈ డ్రోన్లను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. 
 
→ఈ రాడార్లు శక్తిమంతమైన రేడియో తరంగాలను భూగర్భంలోకి పంపి టన్నెళ్లను గుర్తిస్తాయి. 
 
→జమ్మూ ప్రాంతంలో గత మూడేళ్లలో మూడు సొరంగ మార్గాలను బీఎస్‌ఎఫ్‌ గుర్తించింది. వాటిని మాదక ద్రవ్యాల రవాణాకూ వినియోగిస్తున్నారు.
 



National