image



దేశవ్యాప్తంగా ఇదీ ఆహార ధాన్యాల లభ్యత తీరు




→దేశ ప్రజలకు తలసరి ఆహార ధాన్యాల లభ్యత తగ్గుతోంది. 1951లో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఏడాదికి 144 కిలోలుంటే 2021 నాటికి 185.4కి పెరిగింది. 
 
→అత్యధికంగా.. 1991లో తలసరి లభ్యత 188. 2 కిలోలుండగా ఇప్పుడు అంతకన్నా 800 గ్రాములు తగ్గడం గమనార్హం.
 
→వార్షిక తలసరి బియ్యం లభ్యత 1951లో 58 కిలోలు, పప్పులు 22.1 కిలో లుగా ఉంటే 2021లో బియ్యం 71.9, పప్పులు 16.4కి తగ్గాయి.
 
→పప్పుల వార్షిక తలసరి లభ్యత 1955లో 25.7 కిలోలుండగా ఇప్పుడు 16. 3 కిలోలు. పేదలకు పోషకాహారం అందాలంటే పప్పులు ముఖ్యం. 
 
→అవి లేనందునే దేశ ప్రజల్లో పోషకాహార లేమి పెరుగుతోంది.
 
→వంట నూనెల తలసరి వినియోగం 1960-61లో 3.2 కిలోల నుంచి 2020- 21కు 19.7 కిలోలకు, ఇదే కాలవ్యవధిలో టీ పొడి వినియోగం 296 కిలోల నుంచి 863 కిలోలకు, కాపీ పొడి వినియోగం 80 గ్రాముల నుంచి 100 గ్రాములకు పెరిగింది.
 
→బియ్యం వినియోగం గ్రామాల్లో ఎక్కువగా ఉంది. 2011-12లో గ్రామాల్లో ఏడాదికి 74.56 కిలోల బియ్యం వినియోగమైతే పట్టణాల్లో 54.02 కిలో లుంది. 
 
→అదే ఏడాది కూరగాయల వార్షిక తలసరి జాతీయ సగటు విని యోగం 52.61 కిలోలుగా ఉంది.
 
→ఆహార ధాన్యాలపై కేంద్రం ఇస్తున్న రాయితీ 2009-10లో రూ.58,200 కోట్లు ఉంటే 2021-22లో రూ.1,94,100 కోట్లకు పెరిగింది.
 



National