image



పృథ్వి-2 పరీక్ష విజయవంతం




→ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన బాలిస్టిక్ క్షిపణి పృద్వి-2 ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 
 
→ ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. 
 
→ సైనిక దళాల శిక్షణ అభ్యాసంలో భాగంగా దీన్ని నిర్వహించినట్లు పేర్కొ న్నారు. తాజా ప్రయోగంలో క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక అంశాలనూ పరిశీలించినట్లు వివరించారు. 
 
→ ఈ క్షిపణికి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది.
 



Science