→ఎంతో ప్రత్యేకంగా నిలిచిన ఒంగోలు జాతి ఆవులు సహా మూడు స్వదేశీ గోమాతల జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు తొలిసారిగా ఆవిష్కరించారు.
→భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) పరిశోధకులు ఈ ఘనత సాధించారు.
→భారత్లో వేడి వాతావరణాన్ని ఈ జాతులు ఎలా తట్టుకుంటున్నాయన్నది దీనివల్ల తెలుస్తుంది.
→దేశీయ పశు సంపద వృద్ధికీ ఇది దోహదపడుతుందని సంస్థ పేర్కొంది.
→ఈ పరిశోధన వివరాలు ‘బయో ఆర్కైవ్’లో ప్రచురితమయ్యాయి.
→స్వదేశీ ఆవుల జన్యుక్రమాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఆయా జాతులకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→వాటిలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు, వ్యాధుల గురించి కూడా అర్థం చేసుకోవచ్చన్నారు.
→అవి నాసిరకం ఆహారం తీసుకోగలవని, కొన్ని రకాల వ్యాధులను తట్టుకోగలవని తెలిపారు. ఈ పరిశోధన చాలా ముఖ్యమైంది.
→ఎందుకంటే భారత ఆవులకు సంబంధించిన జన్యుక్రమ వివరాలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు.
→ఏదైనా అధ్యయనం చేయాలంటే పశ్చిమ దేశాలకు చెందిన బాస్ టారస్ ఆవు జాతి జన్యుక్రమంపైనే ఆధారపడాల్సి వస్తోందని పరిశోధనలో పాలుపంచుకున్న వినీత్ శర్మ పేర్కొన్నారు.
→ దేశీయ ఆవుల్లో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.
→ తాజా పరిశోధనలో కాసర్గోడ్ డ్వార్ఫ్, కాసర్గోడ్ కపిల, వేచుర్ జాతి ఆవుల జన్యుక్రమాన్ని కూడా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
Science