image



హరిత హైడ్రోజన్ కు రూ.19,744 కోట్లు




→ దేశంలో హరిత హైడ్రోజన్ తయారీకి రూ.19,744 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. 
 
→   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం 'నేష నల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోదముద్ర వేసింది.. 
 
→   ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ ఖరారు చేస్తుంది. 
 
→   వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడటానికి ఈ పథకం ఉప యోగ పడుతుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్    వెల్లడించారు.
 
ఇవీ లక్ష్యాలు:- 
→ 2030 కల్లా, ఏడాదికి 50 లక్షల మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం 
 
→ దీనిని దేశీయ వినియోగంతో పాటు ఎగుమతి చేయాలన్నదీ ప్రణాళిక.
 
→  ఇందుకోసం 60-100 గిగావాట్ల ఎల క్రోలైజర్ సామర్థ్యాన్ని అభివృద్ధిచేస్తారు. తక్కువ ఖర్చుతో హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. 
 
→  ఈ పథకం కింద తొలుత ఎలక్ట్రోలైజర్ తయారీ దారులకు 5 ఏళ్ళ వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. 
 
→  తర్వాత హరిత హైడ్రోజన్ ఉత్పత్తి దారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు.ఈ మొత్తం కలిపి 17,490 కోట్లు 
 
→  హరిత హైడ్రోజన్ కేంద్రాల అభివృద్ధికి రూ.400 కోట్లు ఖర్చు చేస్తారు. పీఎంగతిశక్తి ప్లాట్ఫామ్ ద్వారా వీటిల్లో మౌలికవసతులు అభివృద్ధి చేస్తారు..
 
→ రిఫైనరీలు, ఉక్కు, షిప్పింగ్ లాంటి రంగాల్లో హరిత హైడ్రోజన్ వినియోగం కోసం ప్రయోగాత్మక ప్రాజెక్టు అమలుకు రూ.1,466 కోట్లు కేటాయిస్తారు.
 
→  ఈ మిషన్ ను సరైన దిశలో నడపడానికి సంబంధిత నిపుణులతో సాధికార బృందాన్ని ఏర్పాటు చేసి, సహకరిం చేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని నియమిస్తారు.
 
→  ఈ మిషన్ ను నడిపించడానికి పునరుత్పాదక ఇంధనశా ఖలో మిషన్ సెక్రెటేరియట్ ఏర్పాటుచేస్తారు. దాని డైరె క్టరుగా అత్యంత నైపుణ్యం గల వ్యక్తిని నియమిస్తారు.
 
→  దీనివల్ల 2030 కల్లా ఏటా 50 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుంది. 
 



Science