→కరోనా వైరస్లో కొత్త రూపాలను 100 శాతం గుర్తించే సరికొత్త పరీక్షా విధానాన్ని బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ రూపొందించింది.
→సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్స్ (సీ-క్యాంప్) ఉద్దీపన సంస్థ క్రిస్పర్బిట్స్ రూపొందించిన ఒమిక్రిస్ప్ పరీక్ష ద్వారా ఆర్టీపీసీఆర్ నుంచి తప్పించుకోగలిగే కొత్త జన్యు రకాలను స్పష్టంగా గుర్తించే వీలుందని ఆ సంస్థ ప్రకటించింది.
→జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ - క్రిస్పర్ను వినియోగించి ఈ పరీక్షలు చేపడతారు.
→సెంట్రల్ డిపార్టుమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ ఇండిజీనైజేషన్ ఆఫ్ డయాగ్నస్టిక్స్ కార్యక్రమంలో (ఇండెక్స్) భాగంగా ఇన్స్టెమ్, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్లు సంయుక్తంగా ఈ పరీక్ష విధానాన్ని రూపొందించాయి.
→ఈ పరీక్ష ద్వారా 100 శాతం కచ్చితమైన నివేదికలు సాధ్యమని క్రిస్పర్బిట్స్ సంస్థ ప్రకటించింది.
→అన్ని రకాల వైరస్ జన్యు క్రమాలను గుర్తించే ఈ విధానం భారత్ వంటి దేశాల ప్రజా ఆరోగ్య వ్యవస్థకు అనువైనదని సి-క్యాంప్ సీఈఓ తస్లిమారిఫ్ సయ్యద్ పేర్కొన్నారు.
→కరోనా పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ కంటే విశ్వసనీయమైన పరీక్ష విధానం నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్).
→జన సాంద్రత ఎక్కువగా ఉండే దేశాల్లో వేగంగా విస్తరించే కొత్త వైరస్సు నియంత్రించేందుకు ఎన్జీఎస్ విధానం ఖర్చుతో కూడుకున్నది.
→ఇందుకు ఒమిక్రిస్ప్ అనుకూలమైన పరీక్ష విధానమని క్రిస్పర్బిట్స్ సీఈవో సునీల్ అరోరా తెలిపారు.
Science